అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Thursday, April 16, 2015

కలిసికట్టుగా నష్టనివారణ (హైదరాబాద్ శివార్లలో 'బర్డ్‌ ఫ్లూ'పై)


భాగ్యనగర శివార్లలో 'బర్డ్‌ ఫ్లూ' ఆనవాళ్లు బయటపడటం రెండు తెలుగు రాష్ట్రాల్నీ కలవరపరుస్తోంది. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ ప్రాంతాన రెండు రోజుల్లోనే 18వేల కోళ్లు 'బర్డ్‌ ఫ్లూ' వల్ల మృత్యువాత పడ్డట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ కాగానే, తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దూకింది. తక్షణం

Wednesday, January 21, 2015

కథకులకు పాఠాలు చాసో కథలు

Posted on: Mon 19 Jan 06:
ఆ వీధిలో ఒక ఆరడుగుల పెద్దమనిషి, తెలుగు కథా ప్రపంచాన్ని ఏలిన కథక చక్రవర్తి తిరుగాడిన గొప్ప రచయిత వున్నాడని వారికి తెలియకపోవడమే కాదు, సినిమాలకు కథలు రాస్తారా అని వారడగటం... అది వాళ్ళ తప్పు కాదు, గొప్ప రచయితల్ని గుర్తించి, గౌరవించే సంస్కారం, అభిరుచి లేకపోయిన మనవాళ్ళ నిర్లక్ష్య ఫలితం.

Sunday, January 18, 2015

స్వైన్ రన్...

Sakshi | Updated: January 18, 2015 01:35 (IST)
స్వైన్ రన్...
స్వైన్‌ఫ్లూ... గ్రేటర్‌లో మృత్యు ఘంటికలు మోగిస్తోంది. నగరవాసుల ప్రాణాలను మింగేస్తోంది. వారం రోజుల్లో ఏడుగురు మృత్యువాత పడ్డారు. గాంధీ, బంజారాహిల్స్ కేర్, అపోలో, యశోద, కిమ్స్, ఉస్మానియా, సిటీజన్స్, పీస్ ఇలా ఏ ఆస్పత్రిలో చూసినా స్వైన్ ఫ్లూ రోగులే. కేవలం 17 రోజుల్లో 136 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చలికాలంలో ఈ వైరస్ వేగంగా విస్తరిస్తోంది..

Friday, January 9, 2015

దళిత కవిత్వానికి తల్లి భాషే ప్రాణం

                    దళిత కవిత్వానికి తల్లి భాష, తల్లి తనం ప్రాణం. ప్రతి దళిత కవికీ వాళ్ళ అమ్మే మొదటి గురువు. తల్లి మూల పదాలు పలుకుతుంది. ప్రతీకాత్మకం గా మాట్లాడుతుంది. మానవ త్వాన్ని శృతి చేస్తుంది. తెలుగు మూల పదాల్లో జీవశక్తి ఉంది. తరతరాలుగా అణచబడ్డ ప్రజలు చీకటి నుంచి మాట్లాడారు. వాళ్ళు చీకటిలో బ్రతుకుతున్న వెలుగును గుండెలో దాచుకున్నారు. ఈ అభివ్యక్తి తెలుగు సాహిత్యానికి కొత్త వెలుగులు తెచ్చింది. అనంత వేదనలు

Sunday, January 4, 2015

సైబర్‌ సమరం ముమ్మరం : భారత్‌ పారాహుషార్‌!



జేమ్స్‌బాండ్‌ సినిమా స్క్రిప్టును తలపించే సరికొత్త యుగంలోకి ప్రపంచం అడుగుపెడుతోంది. ఈ యుగంలో అంతర్జాతీయ వ్యవహారాలను ప్రభుత్వాలకన్నా

Thursday, December 25, 2014

క్రిస్టియన్ మిషనరీలు 100 plus

Sakshi | Updated: December 25, 2014
క్రిస్టియన్ మిషనరీలు 100 plus
తెలుగు ప్రాంతంలో క్రైస్తవ మత పరిచయం ఏ సంవత్సరంలో జరిగిందో ఇతమిద్ధంగా చెప్పడానికి ఆధారాలు లేవు. కానీ... 16వ శతాబ్దం తొలినాళ్లలో పోర్చుగీసులు అడుగుపెట్టిన నాటి నుంచి తెలుగువారికి ఏసు క్రీస్త్రు పరిచయమయ్యాడని క్రైస్తవ పెద్దల అభిప్రాయం.

1753లో ఫ్రెంచి నుంచి క్రిస్టియన్ మిషనరీలు కొన్ని తెలుగునాట క్రైస్తవ మతంపై గట్టి నమ్మకం కలగజేశాయని ఓ వాదన. 1800 నాటికి గోల్కొండ రాజ్యంలో

శాంతి సంబరం

    
     శాంతి, ప్రేమ, కరుణ రూపమే జీసస్‌. ఆదరణ, అభిమానం... సామరస్యం, సౌభ్రాతృత్వాల గడ్డ మన దేశం. అలాంటి దేశంలో ఏసుప్రభువు స్మరణతో జనం తరిస్తున్నది. మిన్నంటుతున్న ఆనందోత్సాహాల మధ్య క్రిస్మస్‌ సంబరాలను ఆస్వాదిస్తున్నారు. ఆకాశంలోని నక్షత్రాల్లా జీవన గమనంలో అందరికీ నవోదయం కావాలని ఆకాంక్షిస్తూ...
ఏసుకు మరో పేరు కాపరి. గొర్రెల పాకలో జన్మించాడు. ఆయన గురించి తెలుసుకోవాలంటే బైబిలు చదవాల్సిందే.కొత్త పాత నిబంధనలతో 66 పుస్తకములు కలిపితే బైబిల్‌. ఆ బైబిల్‌ను ఏసు సహచరులు,