Tue, 3 Jan 2012, IST
(ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి)
దేశ ఆర్థికాభివృద్ధికి పట్టుగొమ్మయిన వ్వవసాయం ఆటుపోటుల్ని ఎదుర్కొంటోంది. దాని అనుబంధ రంగాలు కూడా సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్నాయి. ఒకప్పుడు రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన పట్టు పరిశ్రమ ఇప్పుడు చీకట్లను నింపుతోంది. ప్రభుత్వం విదేశీ శిల్కు దిగుమతికిస్తున్న అనుమతులు ఇక్కడి రైతుల జీవితాల్లో కుంపటి అవుతోంది. దిగుమతి సుంకాలను తగ్గించడం ఇక్కడి రైతుల పట్టు ఉత్పత్తిని గుదిబండగా మారుస్తోంది.