ప్రజాశక్తి-ఒంగోలు ప్రతినిధి Mon, 20 Feb 2012, IST
క్వింటాలుకు మూడు వేలు
రూ.351కోట్లు నష్టపోనున్న రైతులు
శనగ ధర ఒక్కసారిగా పతనమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రముఖ వాణిజ్య పంటగా ఉన్న శనగ.. దిగుబడి చేతికొచ్చే సమయంలో ధర పతనం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత పంట కాలంలో ఎన్నడూలేని విధంగా ధరలు పెరగడంతో ఈ ఏడాది ఎక్కువ మంది రైతులు శనగ వైపు మొగ్గు చూపారు. హఠాత్తుగా ధరలు పతనం
